జగన్ మాయమాటలు నమ్మొద్దు .
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే
తెదేపా అధికారంలోకి రావాలి….

గోరంట్ల జనసేన బ్యూరో, ఏప్రిల్ 06:
రాష్ట్రంలో జగన్ అరాచక పాలన సాగుతోందని, ఆయన మాయమాటలు నమ్మీ మరోసారి మోసపోవద్దని టీడీపీ పెనుకొండ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అన్నారు. గోరంట్ల మండలం వానవోలు పంచాయతీ పరిధిలో తాటిమేకలపల్లి పెట్టకుంట్లపల్లి ఉగ్గారంపల్లి ముత్తరాయిని తండా గ్రామాలలో, శనివారం స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ ఏమిటి జనసేన బిజెపి టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ , ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు.

చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వివరించారు. ఈ సందర్భంగా సవితమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, జగన్ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రజల్లో నమ్మకం వచ్చిందని, టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. కావున వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు రెండు ఓట్లను ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే కి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని, ప్రజలను అభ్యర్థించారు.
సవితమ్మ సమక్షంలో టిడిపిలో చేరిన వైసిపి నాయకులు…
తాటి మేకలపల్లి కి చెందిన వడ్డీశంకర, అస్వర్త నారాయణ, శాంతమ్మ లక్ష్మీనారాయణ విశ్వనాథరెడ్డి వెంకటేష్, గోపాల్, భాస్కర్ చలపతితో పాటు దాదాపుగా 10 కుటుంబాలు వైసిపి నుండి పెనుకొండ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సవితమ్మ సమక్షంలో టీడీపీలో చేరారు తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి కండువా కప్పి సాధారoగ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో, మండల కన్వీనర్ సోమశేఖర్, గట్టు చంద్రశేఖర్ రెడ్డి వానవులు రాఘవ నాయుడు అశ్విత నారాయణ, రవి నాయక్ వేణు రాయల్ శ్రీనివాస్ నాయుక్ బొబ్బిలి రామ్మోహన్ వాల్మీకి సోమశేఖర్, కురుమాల జయరాం విజయ శేఖర్ కిషోర్ రాయల్ కురువ మల్లికార్జున ఆదినారాయణ సుధాకర్ రెడ్డి కమల వండ్లపల్లి శ్రీనివాసులు