Janasena News Paper
అంధ్రప్రదేశ్ఈ-పేపర్తాజా వార్తలుపల్నాడు

జగన్ వంచనలతో మోసపోయిన రైతుకు.. కూటమి ప్రభుత్వంతో నిజమైన భరోసా…..

సత్తెనపల్లి రూరల్, నవంబర్ 19,జనసేన ప్రతినిధి…..

సత్తెనపల్లి రూరల్ మండలం గుడిపూడి గ్రామంలో పీఎం కిసాన్‌ – అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నశాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ ,విద్యుత్ శాఖ,పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్,నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు,పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.

డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది.
గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది*
వ్యవసాయం లాభసాటి కావాలి అన్నదాతల బతుకులు మారాలి అన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయం*

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 90 శాతం అమలు చేశాం.

పీఎం కిసాన్‌ – అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తున్నాం.గత ప్రభుత్వం రూ.1,674 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించలేదు.. మా ప్రభుత్వంలో రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాం.రికార్డుస్థాయిలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం.. ధాన్యం విక్రయించే రైతుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ తీసుకొచ్చాం.
గత ప్రభుత్వం పంటల బీమా కూడా చెల్లించలేదు.సత్తెనపల్లి నియోజకవర్గం లో 36,752 రైతన్నలకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు 24.07కోట్ల విడుదల.రైతు జీవితానికి నమ్మకంగా నిలిచింది చంద్రబాబు తెచ్చిన ‘ అన్నదాత సుఖీభవ’ పథకం, కానీ జగన్ హయాంలో రైతు సంక్షేమం కేవలం ఓటు రాజకీయాలకే పరిమితమైంది.రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.20వేలు ఇవ్వనున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులు అర్హులుగా గుర్తించబడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం: రూ.14,000 (రాష్ట్ర వాటా).

కేంద్ర ప్రభుత్వం: రూ.6,000 (పీఎం కిసాన్ పథకం కింద).

తొలి విడతగా కేంద్రం రూ.2000, రాష్ట్ర వాటా రూ.5000 కలుపుకుని రూ.7000 ఆగస్టు 2వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేశారు.
వైఎస్సార్ రైతు భరోసాతో మోసం.“వైఎస్సార్ రైతు భరోసా” అని హంగామా చేశాడు జగన్ రెడ్డి… కానీ వాస్తవానికి అందిన డబ్బులో ఎక్కువభాగం కేంద్రం ఇచ్చినదే. అయినా దాన్ని తన ప్రభుత్వమే పూర్తిగా ఇచ్చినట్టు ప్రచారం చేసి రైతులను మోసం చేశాడు.రైతు భరోసా కింద ఏడాదికి ఒకేదఫాలో రూ.13,500 ఇస్తామని హామి ఇచ్చి 3 దఫాల్లో కలిపి రూ.7,500 మాత్రమే చెల్లించారు. కేంద్రం ఇచ్చే రూ.6వేలను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు.
ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఐదేళ్లకు రూ.30 వేలు నష్టపోతున్నారు.64.06 లక్షల మందికి రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చి.. అమలులో మాత్రం 45 లక్షల మందికి కుదించారు.రైతుల సంక్షేమాన్ని నిజమైన అర్ధంలో కాపాడే పథకం “అన్నదాత సుఖీభవ”. పీయం కిసాన్తో కలిపి ఈ పథకం ద్వారా రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇదే రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం,భరోసా ఇచ్చే పథకం.ఇప్పటికే తొలి విడతలో 7 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ మాడ్యూల్ను ఏర్పాటు చేసింది.ఆగస్టు 3 నుంచి 20 వరకు వచ్చిన ఫిర్యాదులను అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి రైతు గుర్తింపు పొందేలా చర్యలు తీసుకుంది.జగన్ హయాంలో పేరుకు మాత్రమే ఇచ్చిన భరోసా కాకుండా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను అర్థం చేసుకుని, ఒక్కొక్కరికి తగిన విధంగా న్యాయం చేస్తూ ముందుకు సాగుతోంది.రెండో విడత అన్నదాత సుఖీభవ విడుదల.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వైయస్సార్ జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం నుంచే ఈ పథకాన్ని ప్రారంభించి, రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.అభివృద్ధికి ప్రాంతీయ బేధం లేదని, రైతే దైవం అని చాటిచెప్పడానికి దీనిని ఎంచుకున్నారు.అన్నదాతకు డబుల్ ధమాకా- రూ.7 వేల సాయం.అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకాల రెండవ విడతగా 46,85,838 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3135 కోట్లు సొమ్మును జమ చేయనున్న కూటమి ప్రభుత్వం.ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు చొప్పున మొత్తం 7 వేలు జమచేయనున్న ప్రభుత్వం.రెండు విడతల్లో కలిపి పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.6309.44 కోట్ల రైతులకు అందించనున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.2342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.792.09 కోట్లు రైతులకు చెల్లింపు.పిఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతలో ఆగస్టు నెలలో నెలలో రూ.3174 కోట్లు రైతుల ఖాతాల్లో జమ.ఇది రైతు శ్రేయస్సు పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం.లోపాలపై ఉక్కుపాదం – వారసులకు న్యాయం.
గత ప్రభుత్వాల పాలనలో ఉన్న లోపాలను కూటమి ప్రభుత్వం సమూలంగా సరిచేస్తోంది.చనిపోయిన అర్హులైన రైతుల విషయంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి, పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వం.
అర్హత ఉన్న ఒక్క రైతు కూడా నష్టపోకూడదు అనేది కూటమి ప్రభుత్వ సంకల్పం.
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల,గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment