Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్రాజకీయం

అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’

అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’

• సభలో మరో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు.

• అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సీఎం వెల్లడి.

• చాలా ఆలోచించి పేదల సేవలో అనే పేరు పెట్టాం.

• ప్రతి నెలా ఫించన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతృప్తినిస్తోంది.

• టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి.

• అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తామని చెప్పాం.

నాడు చెప్పాం.. నేడు చేసి చూపుతున్నాం. ఆటో డ్రైవర్ల సేవలో పేరుతో ప్రతి ఏడాది రూ.15 వేలు ఇస్తాం.అక్టోబరు 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 2,90,234 మంది డ్రైవర్లు ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో లబ్దిదారులుగా ఉన్నారు.ఏదైనా కారణాల వల్లనైనా ఎవరైనా లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోతే… వారి సమస్యలను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తాం. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్ల స్కీంను వర్తించబడుతుంది.

ఈ పథకానికి రూ.435 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. గత ప్రభుత్వం రూ.12 వేలు ఇవ్వడం విదితమే. కూటమి ప్రభుత్వం 15 వేలు ఇస్తుందని వెల్లడించారు.

Related posts

Leave a Comment