బెల్లంకొండ, డిసెంబర్ 27, జనసేన ప్రతినిధి

బెల్లంకొండ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించినటువంటి గోపి ని బెల్లంకొండ మండల జనసేన అధ్యక్షురాలు తోట రమాదేవి, ఉపాధ్యక్షులు చెన్నకేశవులు నూతనఎస్సైనుమర్యాదపూర్వకంగా కలిసి శాలువాతోసత్కరించారు. గ్రామాలలో శాంతి భద్రతల సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేలా సహకరిస్తానని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ సైదులు, వసంతరావు, శెట్టి సింగరయ్య, వెంకయ్య, సత్యనారాయణ మరియు మండలంలోని గ్రామ పార్టీ అధ్యక్షులు నూకల ఆంజనేయులు, పులిబండ్ల శివ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

