Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలునెల్లూరు

ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు:

*వైయస్ఆర్సీపీ ప్రెస్ నోట్*

తేది: 04-12-2023*
స్థలం: తాడేపల్లి*

ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు: మిచాంగ్‌ తుపాను పై సీఎం జగన్ సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ

ఒక్కరోజే 97 వేల టన్నులు ధాన్యాన్ని సేకరించాం..6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం

బాధిత కుటుంబాలలకు రూ,2500 చొప్పున ఆర్ధిక సాయం

తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి జ‌గ‌న్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌గా పరిస్థితిని సీఎం జగన్ సమీక్షించారు. తీసుకోవాల్సిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రత్తలపై ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారుకు సూచించారు. హుద్‌హుద్‌ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉందని, తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉందని గుర్తుచేశారు. తుపాన్‌ పట్ల అప్రమత్తంగా ఉంటూ, యంత్రాంగం సీరియస్‌గా ఉండాలని సూచించారు. బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారని, గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని, 7వ తేదీ నాటికి పరిస్థితులు కుదుటపడే అవకాశాలున్నాయని తెలిపారు.

ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశామని, అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నామని, వీరంతాకూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని అన్నారు.

ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని, పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదని సూచించారు.
ఆమేరకు వెంటనే చర్యలు తీసుకోవాని ఆదేశించారు. కోతకు వచ్చిన ఖరీఫ్‌ పంటను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైనదని,
నిన్న ఒక్కరోజే 97 వేల టన్నలు ధాన్యాన్ని సేకరించామని, 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. పంటకోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలని, యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు.తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవాలని సూచించారు. ఇది మనకు అంత్యంత ప్రాధాన్యతాంశమని పేర్కొన్నారు.

తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని చెప్తున్నారు. అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5, ఎస్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5 కూడా ఉన్నాయి:

“ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. విలేజ్‌ క్లినిక్స్‌, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయి. ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం. ఇతర రాష్ట్రాలకు ఇలాంటి వ్యవస్థ లేదు. ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలి.ఈ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తపాను వల్ల, భారీవర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి.

సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. మనం ఉంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, అలాంటి సదుపాయాలు ఉండాలి. మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి. కాస్త డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సదుపాయాలు విషయంలో ఎలాంటి లోటూ రాకూడదు. క్యాంపునుంచి ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్లాలి. ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500ఇవ్వాలి. క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్‌, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి.ఈ రేషన్‌ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలి.

గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి. బాధితుల పట్ల దయతో, సానుభూతితో అందించాలి. పరిహారాన్ని సకాలంలో అందించాలి. తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థను వినియోగించుకుని బాధితులను గుర్తించి వెంటనే వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి” అని సీఎం ఆదేశించారు.

*అధికారులకు సీఎం ఆదేశాలు*

– ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టిపెట్టాలి
– జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి
– గర్భిణీలను ఆస్పత్రులకు తరలించాలి
– తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి
– పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికిన నిర్వహించాలి
– విద్యుత్‌, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికిన వాటిని సరిచేయాలి
– సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి
– తుపాను, వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాలి
– నేను కూడా ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అడుగుతాను
– బాగానే చేశారని ప్రజలు సంతోషంగా నాకు చెప్పాలి
– తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను
– సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట బాధితులనుంచి వినిపించకూడదు
– సంతృప్తకర స్థాయిలో బాధితులందరికీ సహాయం అందాలి
– ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు
– డబ్బులు ఇంకా అవసరమైతే..వెంటనే పంపించడానికి అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశాను
– ఒక ఫోన్‌ కాల్‌ దూరంలో మేం ఉంటాం. ఏం కావాలన్నా వెంటనే అడగండి
– సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికిన నడవాలి

Related posts

Leave a Comment