Janasena News Paper
అంధ్రప్రదేశ్గుంటూరుతాజా వార్తలు

బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళి…నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ.

భారత రాజ్యాంగ నిర్మాత, పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా వారికి గుంటూరు నగరంలో లాడ్జి సెంటర్ నందు ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి వారి జన్మదినం సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు నగర కార్యదర్శులు బొడ్డుపల్లి రాధాకృష్ణ, కొర్ర శ్రీను నాయక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గుంటూరు నగర కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ ఒక ప్రకటనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుసరించిన మార్గం,వారు సూచించిన రాజ్యాంగం ఎంతో ముఖ్యమని దళిత బలహీన బడుగు వర్గాల అభ్యున్నతికి వారు చేసిన కృషి అభినందనీయమని తెలియజేశారు.

ఆ మార్గాన్ని భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ గుంటూరు నగర కార్యదర్శి కొర్ర శ్రీను నాయక్ ఇప్పటికీ వారు సూచించిన మార్గాన్ని అనుసరిస్తున్నానని తెలియజేశారు.

Related posts

Leave a Comment