కారు బోల్తా..బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమావశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు..
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన స్మగ్లర్లు.. కారు, గంజాయిని అక్కడే వదిలేసి పరారైనట్లు వివరించారు. వీటిని స్వాధీనం చేసుకొని చిరాగ్పల్లి ఠాణాకు తరలించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు..