Janasena News Paper
పల్నాడు

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో లైంగిక వేధింపుల పై అవగాహన కార్యక్రమం

మండల న్యాయ సేవాధికార సంస్థ సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల న్యాయ సేవ సాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి వి విజయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు ముఖ్యంగా చిన్నారి విద్యార్థులపై జరుగుతున్న ఆకృత్యాలు వేధింపులు ఏ విధంగా ఎదుర్కోవాలో మొదలైన విషయాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం పదవ తరగతి పరీక్షలు రాయబోవు విద్యార్థులకు 40 మంది కి పెన్నులు పరీక్షా ప్యాడ్ స్కేల్ అందించారు ఈ కార్యక్రమంలో ఏజీపీ బాలి సైదా ప్యానల్ లాయర్ బిఎల్ కోటేశ్వరరావు వెంకట శివ పారా లీగల్ వాలంటీర్ సుభాని తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment