దుద్దుకుంట ను గెలిపిద్దాం…. అభివృద్ధికి బాటలు వేద్దాం! ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి!
పూలకుంట్లపల్లి ఎన్నికల ప్రచారంలో దుద్దుకుంట కిషన్ రెడ్డి!

అమడగూరు, ఏప్రిల్ 7 ,జనసేన,, న్యూస్: పుట్టపర్తి అభివృద్ధి సాధకుడు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని గెలిపిద్దాం,అభివృద్ధికి బాటలు వేద్దాం అని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి అన్నారు. పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని పూలకుంట్లపల్లి పంచాయతీ పరిధిలోని పూలకుంట్లపల్లి, బ చ్చిన వారి పల్లి, కుమ్మరిల్లు, ఏటి గట్టి తండా, బోడి గుండ్లపల్లి గ్రామాలలో దుద్దుకుంట కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలత కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నవరత్నాలు, సంక్షేమ పథకాలపై ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పథకాలపై ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా దుద్దుకుంట కిషన్ రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గం లో కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పనిచేశారని గుర్తు చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందజేయడంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గట్టిగా కృషి చేశారన్నారు. సంక్షేమ పథకంలో కాకుండా నియోజకవర్గంలో ప్రతి మారుమూల గ్రామానికి కోట్లాది రూపాయలు వెచ్చించి సిసి రోడ్ల తో పాటు, తారు రోడ్లు మంజూరు చేసి పూర్తిచేసిన ఘనత కూడా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికే దక్కుతుందన్నారు. అలాగే ఇల్లు లేని నిరుపేదల కోసం ఏకంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 26వేల పక్క ఇల్లు మంజూరు చేసి సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత కూడా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికే దక్కుతుందన్నారు.
ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు పుట్టపర్తి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపింది ఒక్క ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో పుట్టపర్తి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే మరోసారి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఇంటింటికి తిరిగి ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇందుకు ఓటర్లు దుద్దుకుంట కిషన్ రెడ్డిని ఎంతో ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జలప్రసాద్ రెడ్డి జడ్పిటిసి శివశంకర్ రెడ్డి, వైయస్ఆర్సీపీ మండల కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ జయప్ప, మండల రైతు సంఘం అధ్యక్షులు ధర్మారెడ్డి, మండల బూత్ కమిటీ కన్వీనర్ రంగారెడ్డి, రాష్ట్ర బట్రాజుల సంఘం డైరెక్టర్ మధుసూదన్ రాజు, సర్పంచులు ప్రకాష్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి, ఆదినారాయణ, ఎంపీటీసీలు సురేందర్ రెడ్డి, నాగరాజు, శ్రీరాములు,పెద్దపయ్య, సింగల్ విండో అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు జనార్దన్ రెడ్డి, తిమ్మిరెడ్డి, మలిరెడ్డి, గంగులమ్మ, నారాయణరెడ్డి, రామకృష్ణ, ప్రసాద్ నాయక్, వాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.