చిట్యాల, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బౌద్ధ అనవాలతో నిండివుందన్న విషయం అవగతమే. ఆంధ్ర ప్రభుత్వం బౌద్ధానికి ప్రతీకైన “అమరావతి” ప్రాంతాన్ని రాష్ట్రానికి రాజధాని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆదరు, కొడవలి, “జిలాకర్ర గూడెం” బీహార్ నలందా యూనివర్సిటీకి ఇక్కడ బ్రాంచ్ గా ఉన్నట్లు ఆదారాలున్నాయి. ఎన్టిఆర్ జిల్లాలో ఘంటశాలలో బౌద్ధ ఆరామాలున్నాయి. విశాఖలో అవకపల్లిలో బౌద్ధ స్థూపాలు, గుంటూర్లో నాగార్జున యూనివర్సిటీలతో నిండివుంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా బౌద్ధమైందిగా ఉండెది. శనివారం నుంచి మంగళగిరిలో సాగుతున్న “భారత నాస్తిక మేళా”లో ముంబై నిజమాబాద్ చిట్యాల నుంచి ప్రతినిధులు హాజరైయ్యారు.
అయితే ఆదివారం సాయంత్రం ఓ ప్రతినిధిఐన అంబేడ్కరైట్ నేత గ్యార శేఖర్ మహారాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతిలో భవ్యమైన గౌతముడి విగ్రహం, బుద్ద మ్యూజియంలో పురవాస్తుశాఖ వారు ఏర్పాటు చేసిన అనేక ప్రాచీన బౌద్ధ శిల్పాలు చూసిన అనంతరం తమకు చాల స్పూర్తినిచిందన్నారు. ఐతే తెలంగాణకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు ఇట్టి అమూల్యమైన స్థలాలను పర్యటించాలని కోరారు. తమ బహుజన విముక్తి పోరాటానికి ఇవీ మరింత స్పూర్తినిస్తుందన్నారు. డాక్టర్ అంబేడ్కర్ మన దేశ ప్రజలకు ఇచ్చిన “భారతాన్ని తిరిగి బౌద్ధమయం” చేయాలన్న పిలుపు సార్టకత ఉంటుందని శేఖర్ మహారాజ్ అన్నారు. ఇందులో జర్నలిస్ట్ అంగుళి మాలజీ, డి.ఎల్ మాలజీ, మూలనివాసి మాలజీ లతోపాటు 2రోజుల నాస్తిక మేళా, పర్యటనకు సంఘ సేవకురాలు మల్లిపూడి షర్మిల సహకారం అందించారు.