కరోనావైరస్ కేసుల సంఖ్య తాజాగా పెరిగిన నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు మార్చి 25, 2023 న పంపించడం జరిగింది. రద్దీ ప్రదేశాలలో మాస్కుల వినియోగం పెంచాలని, కనీస కోవిడ్ టెస్టులను చేయాలనీ ఈ లేఖలో సూచించారు.
గత కొన్ని వారాల్లో COVID-19 కోసం పరీక్షలు కొన్ని రాష్ట్రాల్లో “తగ్గించబడ్డాయి” మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన ప్రమాణం కంటే తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.