Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

దాతల సహకారంతోడొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ….అభినందనీయం…

తడవర్తి నాగేశ్వరరావు..ఆర్య సంఘము నాయకులు…

దాతల సహకారంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో 37 వ సారి నిరుపేద రోగులకు, సహాయకులకు ఉచితంగా 120 మందికి భోజనం అందించటం అభినందనీయం…..తడవర్తి నాగేశ్వరరావు,, ఆర్య సంఘము నాయకులు మరియు ఎల్. ఐ. సి ఏజెంట్.

కొమెరపూడి ,సత్తెనపల్లి రూరల్ మండలం,పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేద రోగులకు, సహాయకులకు,జనసేన పార్టీ నాయకులు అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో జరుగుతున్న డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ

పథకంలో 37 వ సారి సత్తెనపల్లి మండలంలోని కొమెరపూడి గ్రామానికి చెందిన దివ్వెల శేషగిరిరావు,శేషారత్నం మనవరాలు దివ్వెల గోపీనాథ్,ఉమా చిన్న కుమార్తె దివ్వెల గోపిశ్రీ జన్మదిన సందర్బంగా వీరి ఆర్ధిక సహాయంతో ఉచితంగా భోజనం అందించటం జరిగింది..

ఈనాటి కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డా. సుజాత,డా.అనూష,నర్సింగ్ సూపర్నెంట్ రాధా,ఇద్దరు హెడ్ నర్సులు,పెద్దలు పగడాల సాంబశివరావు, పులిపాటి శ్రీరామమూర్తి, సూరే రామకోటేశ్వరరావు,గంజి వీరాస్వామి, పోతుగంటి నరసింహారావు,దివ్వెల శ్రీనివాసరావు,కోటి సాహెబ్, కట్టమూరి అప్పారావు,దివ్వెల సాంబశివరావు,తడవర్తి నాగేశ్వరరావు, తడవర్తి హనుమంతరావు,దివ్వెల సాంబశివరావు (కొమెరపూడి)కటకం విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment