Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పట్టణంలో వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు..

స్మార్ట్ మీటరును అమర్చుతున్న సిబ్బంది.

సత్తెనపల్లి, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 08: సత్తెనపల్లి పట్టణంలో వివిధ వ్యాపార సంస్థలకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో స్పాట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు పట్టణ విద్యుత్ శాఖ ఏఈ కిరణ్ తెలిపారు.పట్టణంలో ఇప్పటి వరకు షుమారు 1700 స్మార్ట్ మీటర్లు బిగించామన్నారు. ఈ స్మార్ట్ మీటర్లను గత మూడు నెలలుగా బిగిస్తున్నామని, మొదట పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ,ఇప్పుడు పట్టణంలోని వివిధ వ్యాపార సంస్ధలకు,అనంతరం గృహాలకు అమర్చనున్నట్లు వివరించారు.తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో వెళ్లి బిగిస్తున్నారని, కావున వినియోగ దారులు సహకరించాలని ఏఈ కిరణ్ కోరారు.

Related posts

Leave a Comment