ఆంధ్రప్రదేశ్లో కృష్ణా-గోదావరి నదుల విజృంభణ: వరద హెచ్చరికలు కొనసాగుతున్నాయి
జనసేన తెలుగు న్యూస్: ఆంధ్రప్రదేశ్లో కృష్ణా మరియు గోదావరి నదుల వరద ప్రవాహం కొనసాగుతూ, ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక మరియు డౌలేశ్వరంలో మొదటి హెచ్చరిక తొలగింపుతో పరిస్థితి స్థిరంగా ఉంది.

రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సోమవారం ప్రకటన ప్రకారం, కృష్ణా మరియు గోదావరి నదుల వరద ప్రవాహం స్థిరంగా ఉందని తెలిపారు.
ప్రకాశం బ్యారేజీలో 6.86 లక్షల క్యూసెక్స్ ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లో , రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది
భద్రాచలంలో నీటి మట్టం 44.4 అడుగులుడౌలేశ్వరంలో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీలో 9.8 లక్షల క్యూసెక్స్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో, మొదటి ప్రమాద హెచ్చరిక తొలగింపు
సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితిని క్రిటికల్ గా అభివర్ణిస్తూ, అధికారులతో ఆన్లైన్ సమీక్ష నిర్వహించారు. కొల్లూరు, భట్టిప్రోలులో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
ప్రకాశం బ్యారేజీ అంచనాలు:
- సోమవారం 7 లక్షల క్యూసెక్స్ మించే అవకాశం
- ప్రస్తుతం 69 క్రెస్ట్ గేట్లు తెరవబడ్డాయి
- సముద్రంలోకి వరదనీరు విడుదల కొనసాగుతోంది
అత్యవసర కాల్ నంబర్లు:
112 – ఎమర్జెన్సీ సేవలు
1070 – రాష్ట్ర హెల్ప్లైన్
1800-425-0101 – విపత్తు నిర్వహణ
విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏపీ వరదలు
ఈ వరద పరిస్థితి 2024 విజయవాడ వరదల తర్వాత రెండోసారిగా రాష్ట్రంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికారులు 24/7 మానిటరింగ్తో పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు కృషి చేస్తున్నారు.
#APFloods2025 #KrishnaRiverFlood #PrakasamBarrage #GodarariFlood #AndhraPradeshWeather #FloodWarningAP

